students

 ఎస్.వి.టి  రూరల్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత శిక్షణ, ఉపాధి

Webdesk | Wednesday, July 11, 2018 11:51 AM IST

  హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ యువతకు స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్(ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)లో ఉచిత వసతితోపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ కిషోర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోమొబై ల్, ఎలక్ట్రీషియన్, డీటీపీ, ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్, సోలార్ సిస్టం ఇన్‌స్టాలేషన్, సర్వీస్, నూయింగ్ మెషీ న్ ఆపరేటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ కోర్సులకు ఏడు, పదోతరగతి, ఇంటర్, బీకాం చదివి, 18-35 ఏండ్ల అభ్యర్థులే అర్హులన్నా రు. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పొచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని ఎస్‌ఆర్‌టీఆర్‌ఐలో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు http//srtri.com, 9133908 000, 9133908111, 9133908222, 99484 66111 నంబర్లను సంప్రదించాలని కోరారు.