హైదరాబాద్ : ఈ నెల12న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ శరత్చంద్ర సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్ కార్యదర్శి డిఎస్.రమ్య తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పదవ తరగతి నుంచి డిగ్రీ చదివిన నిరుద్యోగుల కోసం వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు నేరుగా బషీర్బాగ్ ప్రెస్క్లబ్ కు తమ సర్టిఫికేట్లతో పాటు ఆధారుకార్డు తీసుకుని రావాలని వివరాలకు 8897226495, 8790806244 నెంబర్లను సంప్రదించాలని కోరారు.