సికింద్రాబాద్లోని ఆర్కేపురం-ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పీజీటీ, టీజీటీ, పీఆర్టీ,అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ (అవేస్) ఆధ్యర్యంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)-1 పోస్టు (పొలిటికల్ సైన్స్)
అర్హత: పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. అవేస్ సీఎస్బీ ఎగ్జామ్లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)-4 పోస్టులు
విభాగాలు: సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ.
అర్హత: సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. సీటెట్/టెట్, అవేస్ సీఎస్బీ ఎగ్జామ్లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ప్రైమరీ టీచర్ (పీఆర్టీ)-5 పోస్టులు
అర్హత: సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. సీటెట్/టెట్, అవేస్ సీఎస్బీ ఎగ్జామ్లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
లైబ్రేరియన్
అసిస్టెంట్ లైబ్రేరియన్
అర్హత: బీఎస్సీ (లైబ్రెరీ సైన్స్)లో ఉత్తీర్ణత. 45/35 ఏండ్లకు మించరాదు.
రిసెప్షనిస్ట్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. 30 ఏండ్లకు మించరాదు.
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్
అర్హత: సైన్స్లో ఇంటర్/10+2లో ఉత్తీర్ణత. కంప్యూటర్లో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. 30 ఏండ్లకు మించరాదు.
దరఖాస్తు: ఆఫ్లైన్ లేదా వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. పూర్తి వివరాలకు కంపెనీ వెబ్సైట్ లేదా ఈ మెయిల్ ([email protected]
) చూడవచ్చు.
చివరితేదీ: మే 31
వెబ్సైట్: www.apsrkpuram.edu.in