హిమాయత్నగర్: మల్టీమీడియా,యానిమేషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ పద్మశాలీ సంఘం గ్రేటర్ అధ్యక్షుడు కందగట్ల స్వామి తెలిపారు. నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కింగ్కోఠి శాలీమార్ థియేటర్ సమీపంలో ఉన్న జెమిని క్రి యేషన్స్లో మల్టీ మీడియా,యానిమేషన్ కోర్సు లకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుం దని,అనంతరం వారికి పరీక్ష నిర్వహించి సర్టిఫి కేట్ను అందజేయనున్నట్లు తెలిపారు.ఇంటర్ పూర్తి చేసిన యువతీ,యువకులు ధరఖాస్తు చేసు కోవాలని ఆయన సూచించారు.పూర్తి వివరాలకు 9290733999 ను సంప్రదించాలని కోరారు.