online-courses

కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ

Webdesk | Wednesday, February 21, 2018 10:31 AM IST

 హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉచితంగా కంప్యూటర్ డెస్క్‌టాప్ కోర్సులను నేర్పిస్తున్నట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ హనుమానాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. పదవ తరగతి చదువుకున్న యువతీ యువకులకు ఉచితంగా కంప్యూటర్ డెస్క్ టాప్ కోర్సులను నేర్పిస్తున్నామన్నారు. ఈ నెల 21 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. 26తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. శిక్షణ మూడు నెలల పాటు ఉంటుందని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌తో పాటు జాబ్ ఇప్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు జీరాక్స్, పదవతరగతి పాస్ మెమో జీరాక్స్, పాస్ పోర్టు సైజ్ రెండు ఫోటోలతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఐటీఐ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 79979 73463 సెల్ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.